ఇలియానా బాలీవుడ్ కి వెళ్లి తప్పు చేసిందా ..?

-

ఇలియానా టాలీవుడ్ లో ఒకప్పుడు ఈమె పేరు వింటే కుర్రకారు ఊగిపోయింది అంటే అతిశయోక్తి లేదు అంతగా ఆమె నటన, అందంతో టాలీవుడ్ ని కట్టిపడేసింది. ఇలియానా ఏదయినా క్యారెక్టర్ చేస్తే దానిలో నటించేది కాదు చెప్పాలి అంటే జీవించేది. అంతగా తన అభినయం తో ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఇలియానా వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వం లో దేవదాసు అనే సినిమాతో టాలీవుడ్ ప్రవేశం చేసింది ఈ సినిమాలో రామ్ తో జోడి కట్టింది. ఈ సినిమాలో ఆమె చేసిన యాక్టింగ్ కు టాలీవుడ్ ఫిదా అయింది. అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి ..

ఇలియానా ఆ తర్వాత పూరి దర్శకత్వంలో లో వచ్చిన పోకిరి సినిమాలో మహేష్ పక్కన జోడి కట్టింది. ఈ సినిమా టాలీవుడ్ లెక్కలు తిరగరాసింది అని అందరికి తెల్సిన విషయమే. దీనితో పాప కు ఆఫర్లు దండెత్తాయి. నిర్మాతలు ఈమె డేట్స్ కోసం వేచి చూసేవాళ్ళు. అలాగే రవితేజ తో నటించిన కిక్ సినిమా కూడా బాక్సఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. దానితో అమ్మడు రేంజ్ పెరిపోయింది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలిచింది. కానీ ఈ స్టార్ డమ్ ఎక్కువ కాలం నిలుపుకోలేదు. ఇక్కడ ఉన్న అవకాశాలను వదిలేసి బాలీవుడ్ వైపు చూసింది.

టాలీవుడ్ వద్దు అంటూ వెళ్ళిపోయింది. కానీ అక్కడ పాప అనుకున్నంత సాధించలేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఉన్న ఈమె బాలీవుడ్ లో ఒక్క ఛాన్స్ అంటూ వెయిట్ చేసింది. కానీ ఆమెను బాలీవుడ్ ఏ మాత్రం పట్టించుకోలేదు. ఒకటి, రెండు సినిమాల్లో నటించిన అందులో పెద్ద చెప్పుకో దగ్గ పాత్రలు కాదు  అంతే కాకుండా మధ్యలో ఆండ్రూ బోన్ అనే ఇంగ్లీష్ ఫొటోగ్రాపర్ తో ప్రేమాయణం కొనసాగించింది. కానీ అది ఎంతో కాలం సాగలేదు ఈ పరిమాణం తో ఇల్లి బేబీ బరువు పెరిగి డిప్రెషన్ లోకి వెళ్ళింది అని బాలీవుడ్ టాక్. మళ్ళీ తాను చేసిన తప్పు తెల్సుకొని శ్రీను వైట్ల దర్శకత్వం లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాలో రవితేజ పక్కన టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికైనా తను చేసిన తప్పు తెల్సుకుంది అని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news