రానా సినిమాలకు గుడ్ బై చెప్పేసారా…?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబానికి మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా నిర్మాత సురేష్ బాబు వారసుడిగా రానా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. లీడర్ సినిమాతోనే మంచి నటుడుగా గుర్తింపు పొందిన రానా అటు తరువాత వరుస సినిమాలతో ప్రేక్షకులను బాగానే అలరించారు. ఇక రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి చిత్రంలో బల్లాల దేవుడి పాత్రలో ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నారు. ఇక తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా విలన్ గా నటించారు. ముఖ్యంగా భీమ్లా నాయక్ సినిమాలో కూడా విలన్ గా మరొకసారి ప్రేక్షకులను మెప్పించారు.

భీమ్లా నాయక్ సినిమా అయిపోయిన వెంటనే వేణు ఉడుగుల డైరెక్షన్ లో సాయి పల్లవి హీరోయిన్గా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన విరాటపర్వం చిత్రం విడుదల అయింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేక పోయింది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్నా.. రానా ఇప్పటివరకు తన తదుపరిచిత్రాన్ని ప్రకటించలేదు. దీంతో రానా అభిమానులు.. రానా సినిమాలు మానేశారా అనే విషయంపై చాలా సందిగ్ధంగా ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త ప్రకారం రానా విరాటపర్వం సినిమా కథ కమిట్ అయిన తర్వాత మరే కథలను కూడా అంగీకరించలేదట.

తన తదుపరిచిత్రాలు కూడా ఇలాంటి రియాలిటీ స్టోరీల కథ ఉంటేనే చేస్తానని చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రానా ఆరోగ్య సమస్యల కారణంగా కూడా గత కొద్దిరోజులుగా ఇబ్బంది పడుతున్నారని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. దీంతో అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుచేతనే రానా ఎలాంటి సినిమాలను ఇంకా ప్రకటించలేదని సమాచారం. మరి రానా ఈ విషయాలపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news