బ్రేకింగ్ : పెళ్లి వేడుకలో విషాదం.. గ్యాస్‌ సిలిండర్‌ పేలి 5 గురు మృతి, 50 మందికి

-

రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రం జోద్పూర్ లో ఓ పెళ్లి వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జ్యోతి పూర్ లోని ఓ పెళ్లి వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలి ఏకంగా ఐదు మంది మరణించారు.

అలాగే మరో 50 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పెళ్లి నేపథ్యంలో వంటలు చేస్తున్న గదిలో ఒక్కసారిగా ఈ సిలిండర్ పేలినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం క్షత గాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇక  దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news