క్రాక్ -2 సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎటువంటి సపోర్టు లేకుండా వచ్చి ఎదిగిన నటులలో రవితేజ కూడా ఒకరు. మొదట ఎన్నో చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ఆ తర్వాత హీరోగా ఎదిగారు రవితేజ. ముఖ్యంగా రవితేజ సినిమాలు అంటే ప్రేక్షకులకు చాలా వినోదాన్ని అందిస్తాయని చెప్పవచ్చు. అలా రవితేజ హ్యాట్రిక్ సూపర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఇప్పటివరకు డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలలో నటించారు ఈ చిత్రాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి.

రవితేజ నటించిన క్రాక్ సినిమాలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని .డాన్ శీను లో ఆవారాగా.. బలుపులో రౌడీగా.. క్రాక్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చూపించారు. దీంతో అభిమానులు కూడా వీరిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. వీరి కాంబోలో వచ్చిన చిత్రాలు అన్ని కూడా విజయం సాధించడం తోపాటు రవితేజ కెరియర్ డీలా పడుతున్న సమయంలో సరైన సక్సెస్ ఇవ్వడం జరుగుతోంది. తాజాగా రవితేజ అభిమానులకు గోపీచంద్ ఒక గుడ్ న్యూస్ చెప్పినట్లుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక రవితేజ కూడా ప్రస్తుతం ధమాకా సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. అలా గోపీచంద్ మలినేని, బాబి ,అనిల్ రావిపూడి ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ గోపీచంద్ రవితేజ గురించి మాట్లాడుతూ.. రవితేజ పై తన ప్రేమను సినిమాల ద్వారానే చూపిస్తాను. తన లైఫ్ లో ఎన్ని పనులు ఉన్నప్పటికీ రవితేజ కోసం అన్ని పక్కన పెట్టి ఇప్పటివరకు డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాము. నెక్స్ట్ క్రాక్-2 వస్తుందని తెలియజేశారు .దీంతో రవితేజ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news