రాడిసన్ డ్రగ్స్ కేసు అప్డేట్.. రేపు విచారణకు డైరెక్టర్ క్రిష్

-

హైదరాబాద్‌లో రాడిసన్‌ హోటల్‌ కేంద్రంగా జరిగిన డ్రగ్స్‌ పార్టీ కేసులో రోజుకో ట్విస్ట్ కలుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు ఫోన్‌ డేటా, లావాదేవీల ఆధారంగా పోలీసులు కొంతమంది వివరాలు సేకరించినట్లు సమాచారం.

ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేసిన సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జాఫ్రీని గచ్చిబౌలి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బుధవారం రోజున వివేకానంద్‌ డ్రైవర్‌ ప్రవీణ్‌ను సైతం అదుపులోకి తీసుకున్న అధికారులు.. అబ్బాస్‌ వివిధ మార్గాల్లో కొకైన్‌ తెచ్చి డ్రైవర్‌ ప్రవీణ్‌కు ఇస్తున్నట్లు విచారణలో తేలినట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రవీణ్‌.. వివేకానంద్‌కు అందిస్తున్నాడని, ప్రవీణ్‌, అబ్బాస్‌ల మధ్య నగదు లావాదేవీలను గుర్తించినట్లు చెప్పారు. మరోవైపు డ్రగ్స్‌ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్‌ హాజరైనట్లు దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. శుక్రవారం వస్తానని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news