మహేశ్ బాబుతో మరో సినిమాపై కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

టాలీవుడ్ డైరెక్టర్‌ కృష్ణవంశీ అంటే తెలియని వారుండరు. మురారి, నిన్నే పెళ్లాడతా, సింధూరం, గులాబీ వంటి కల్ట్ సినిమాలు తీసిన కృష్ణవంశీ ఇటీవల రంగమార్తాండతో మనముందుకు వచ్చారు. ఈయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటమే గాక అభిమానులు అడిగిన ప్రశ్నలకు అప్పుడప్పుడు సమాధానాలు కూ డా ఇస్తుంటారు. అయితే తాజాగా నెట్టింట ఓ నెటిజన్ కృష్ణవంశీ- హీరో మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ చిత్రం ‘మురారి’ మూవీని గుర్తుచేస్తూ మహేశ్‌ బాబుతో మరో సినిమా తీస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేశాడు. దానికి కృష్ణవంశీ రియాక్షన్ ఎలా ఉందంటే?

‘‘మీరు ఆణిముత్యాల్లాంటి సినిమాలు అందించగల సత్తా ఉన్నవారు. మా అభిమాన నటుడు మహేశ్‌ బాబుతో ఓ కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నించండి’’ అని ఓ అభిమాని కోరగా.. ‘‘మహేశ్‌ బాబు ఇంటర్నేషనల్‌ స్టార్‌ కాబోతున్నారు. అందుకే ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం కష్టమండీ’’ అని కృష్ణవంశీ అన్నారు. మరో అభిమాని ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా సీక్వెల్‌ను నాగ చైతన్యతో తీస్తే చూడాలనుందని మనసులో మాట బయటపెట్టగా.. సీక్వెల్‌ చేయలేనని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news