ఫిల్మ్ ఇండ‌స్ట్రీపై దివ్య‌వాణి విమ‌ర్శ‌లు!

-

న‌టి దివ్య‌వాణి ఫిల్మ్ ఇండ‌స్ట్రీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ తెలుగు మ‌హిళ ఆధ్వ‌ర్యంలో రౌండ్ టేబుల్ స‌మావేశం సోమ‌వారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న న‌టి, టీడీపీ మ‌హిళా విభాగం నేత దివ్య‌వాణి ఫిల్మ్ ఇండ‌స్ట్రీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇండ‌స్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ల పిల్ల‌లు సైతం డ్ర‌గ్స్‌కు బానిస‌లు అవుతున్నారన్నారు.

అవ‌స‌రాల కోసం దిగ‌జారుతున్న వారు కూడా ఇండ‌స్ట్రీలో వున్నార‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో తెర‌పైకి వ‌చ్చిన డ్ర‌గ్స్ కేసు ఎంత వ‌ర‌కు వ‌చ్చిందో ఏమైందో తెలంగాణ ప్ర‌భుత్వం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇండ‌స్ట్రీలో డ‌బ్బున్న వాళ్ల‌దే రాజ్యంగా మారింద‌ని, ర‌కుల్ కు ఉన్న‌దేమిటి ప్ర‌ణీత‌కు లేనిదేమిట‌ని ప్ర‌శ్నిస్తోంది. ర‌కుల్‌లా ప్ర‌ణీతి పెద్ద హీరోల‌తో క‌లిసి న‌టించ‌క‌పోవ‌డానికి చాలా కార‌ణాలున్నాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న కూతురు చ‌దువుతున్న మాస‌బ్ ట్యాంక్ లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో డ్ర‌గ్స్ కు అల‌వాటు ప‌డిన విద్యార్థులు చాలా మందే వున్నార‌ని ఆరోపించింది.

Read more RELATED
Recommended to you

Latest news