పాన్ ఇండియా సినిమాలు ఎన్ని రెడీ అవుతున్నాయో తెలుసా ..?

-

బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టిస్టారర్ ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు నటిస్తున్నారు. భారీ కాన్వాయిస్ తో రెడీ అవుతున్న ఈ సినిమాని బాహుబలి కంటే ఇంకా ఎక్కువ పాన్ ఇండియా క్రేజ్ వచ్చేలా రాజమౌళి తీర్చి దిద్దుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, సీనియర్ హీరో అజయ్ దేవగన్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ హైలెట్ గా నిలవబోతుందట.

 

ఇక కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య రూపొందుతుంది. ఈ సినిమాలో ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు ని నటింపచేయాలనుకున్నారు. కాని కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ పాత్రని రాం చరణ్ చేయబోతున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో కాజల్ అగ్ర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవదాయ దర్మదాయ శాఖలో జరుగుతున్న అవినీతి ని ప్రధాన అంశంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారు. 2021 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.

 

అంతేకాదు రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా టార్గెట్ గా వస్తోంది. సాహో తో నిరాశపరచిన ప్రభాస్ ఈ సారి భారీ సక్సస్ కొట్టాలన్న ప్లాన్ లో ఉన్నాడు. ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇక కే.జి.ఎఫ్ ఛాప్టర్ 2 కూడా పాన్ ఇండియా సినిమాగానే నిర్మిచారు. ప్రశాంత్ నీల్-యశ్ కాంబినేషన్ లో ఇంతకముందు వచ్చిన కే.జి.ఎఫ్ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటీ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 

ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి సుజీత్ కాంబినేషన్ లో నిర్మించబోయో లూసీఫర్ రీమేక్ ని కూడా పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సుజీత్ స్క్రిప్ట్ ని ఆ టార్గెట్ గానే రెడీ చేస్తున్నాడు. ఇక పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండ సినిమా కూడా నాలుగు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. దీంతో పాటు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న పుష్ప సినిమా 5 భాషల్లో భారీ సినిమాగా పాన్ ఇండియా టార్గెట్ గా రెడీ చేస్తున్నారు. ఇవే కాదు పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం, కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కతున్న భారతీయుడు 2 కూడా పాన్ ఇండియా సినిమాలుగానే రెడీ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news