బ్రేకింగ్: ఆ నలుగురు బాలీవుడ్ హీరోయిన్లకి సమన్లు జారీ చేసిన ఎన్సీబీ.

-

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యేలా చేసింది. మాదక ద్రవ్యాల విషయంలో రియా చక్రవర్తి, తన తమ్ముడు షోవిక్ చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ రిమాండ్ లో ఉన్నారు. రియా చక్రవర్తిని ప్రశ్నించిన నార్కోటిక్స్ టీమ్ మరికొంత మంది సెలెబ్రిటీలని పేర్లని తెరమీదకి తెచ్చింది.

తాజాగా నార్కోటిక్స్ బ్యూరో మాదక ద్రవ్యాల కేసులో బాలీవుడ్ హీరోయిన్లు అయిన దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్, సారా ఆలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ లకి సమన్లు జారీ చేసింది. దీనిపై నలుగురు హీరోయిన్లని ఎన్సీబీ ప్రశ్నించబోతుంది. ఈ నలుగురిలో రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు వారందరికీ పరిచయమే. ప్రస్తుతం తెలుగు సినిమా కోసం హైదరాబాద్ లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news