ED: స్టార్ హీరోయిన్ కి ఈడీ నోటీసులు..!

-

తాజా గా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ కి నోటీసులు జారీ చేసింది. 19వ తేదీ హాజరు కావాలని నోటీసులో పేర్కొనడం గమనార్హం. కేవలం రకుల్ ప్రీతిసింగ్ మాత్రమే కాదు టిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కూడా ఈడి నోటీసులు జారీ చేసింది. వీరిద్దరూ కలిసి 19వ తేదీ ఈ డీ ముందు హాజరు కానున్నారు. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ డి విచారణ జరిపింది ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో సైలెంట్ అయింది.

కానీ తెలంగాణ పోలీసులు పూర్తిస్థాయిలో ఆధారాలు ఇవ్వలేదని. కోర్టుకు వెళ్లి ఆధారాల కోసం న్యాయపోరాటం చేశారు . హైకోర్టు పదేపదే ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఈడికి ఆధారాలు ఇచ్చారు.. అయితే ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ డ్రగ్స్ పై ప్రత్యేకంగా నోటీసులు జారీ చేస్తూ ఉండడం గమనార్హం. చాలా రోజుల ఆలస్యం తర్వాత ఇప్పుడు మళ్ళీ నోటీసులు జారీ చేస్తున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల్ని ఇప్పటికే ఈడి అధికారులు ప్రశ్నించగా వారి నుంచి ఎటువంటి ఆధారాలు లభించలేదు.

అందుకే ఇప్పుడు మళ్లీ ఈడి విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రకుల్ ప్రీతిసింగ్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో వరుస సినిమాలను చేస్తూ దూసుకుపోతున్న తరుణంలో ఇలా ఈడి నోటీసులు రావడంతో ఆమె అభిమానులు కలవరపడుతున్నారు. మరి విచారణలో భాగంగా ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు.. ఈమె ఎలాంటి సమాధానం ఇవ్వబోతోంది అనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు మరి కొంతమంది ఈ డి విచారణకు రావాల్సిందేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news