ఏ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చిందో తెలియదు – ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

-

తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడి షాక్ ఇచ్చింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడి నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపింది. ఈనెల 19వ తేదీన తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులలో ఈడీ పేర్కొంది. బెంగళూరు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి హస్తం ఉందని మూడు రోజుల క్రితం బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే.

ఈ తరుణంలో ఇప్పుడు నోటీసులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈడి నోటీసులపై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పందించారు. ” నాకు ఈడి నుంచి నోటీసులు వచ్చాయి. కానీ నేను ఇంకా ఆ నోటీసులు చూడలేదు. ఏ కేసులో అన్నది నోటీసులలో లేదు. అసలు ఏ కేసులో ఈడి నోటీసులు ఇచ్చింది అనే విషయం తెలియదు. నా బిజినెస్, ఐటీ రిటర్న్స్, కుటుంబ సభ్యుల బ్యాంకు వివరాలు అడిగారు. ఈడీ విచారణకు నేను పూర్తిగా సహకరిస్తా ” అన్నారు పైలట్ రోహిత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news