మహేష్ బాబు పై అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. కారణం..?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన ఈమధ్య సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత మళ్లీ సినిమా అప్డేట్లను అందివ్వలేదు. దాంతో అభిమానులు పూర్తిస్థాయిలో నిరాశ వ్యక్తం చేశారు. కానీ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అలా కొన్ని నెలలపాటు సినిమా షూటింగ్ పూర్తి చేసి షాట్ బాగా రాలేదని మొత్తం స్క్రాప్ చేయడం జరిగింది.

అయితే అలా ఆరు నెలల పాటు సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. అంతలోనే సూపర్ స్టార్ కృష్ణ తల్లిగారి మరణం తండ్రిగారి మరణం ఆయనను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక తర్వాత ఆ బాధ నుంచి తేరుకోవడానికి వెకేషన్స్ కి బయలుదేరిన మహేష్ బాబు అక్కడినుంచి రాగానే ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అయితే సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ చేయగానే అభిమానులంతా సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ షాపింగ్ మాల్ లో శ్రీ లీలా , మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన షాట్లు బాగా రాలేదని త్రివిక్రమ్ స్క్రాప్ చేసాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహేష్ బాబు మళ్ళీ సినిమా షూటింగ్ కి బ్రేక్ చెప్పినట్లు సమాచారం.

అయితే ఇదంతా ఫేక్ అని సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ మహేష్ బాబు నిన్న ఎయిర్పోర్టులో కనిపించి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా ఆయన మళ్ళీ తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్స్ కి వెళ్ళిన ఫోటోలు కెమెరా కంటికి చిక్కాయి. దీంతో అవి కాస్త వైరల్ అవ్వడంతో సినిమా నుంచి రేపో, మాపో టీజర్, ట్రైలర్ వస్తుందని అంతా అనుకుంటుంటే.. మీరు మాత్రం ఇలా బాధ్యతారహితంగా వెకేషన్స్ కి వెళ్తున్నారు ఇక్కడ అభిమానులు మీకోసం ఎదురు చూస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మహేష్ ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news