అంబానీ ఇంట గణేశ్ చతుర్థి వేడుకలు.. తరలివచ్చిన సినీ, క్రీడా తారలు

-

దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబురాలు మొదలయ్యాయి. వాడకో గణేష్ మండపం.. మండపం వద్ద భక్తుల కోలాహలంతో వీధులన్నీ సందడిగా మారాయి. మరోవైపు ప్రముఖులు కూడా తమ ఇళ్లలో గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఘనంగా వేడుకలు జరుపుతున్నారు. ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ ఇంట గణేశ్ చతుర్థి వేడుకలు నిర్వహించారు.

ముంబయిలోని ముకేశ్ నివాసం అంటాలియాలో గణేష్ ఉత్సవాల సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. సెప్టెంబర్ 19 రాత్రి ముంబయిలోని తన ఇంట్లో గణేశ్​ చతుర్థి వేడుకలను అంబానీ గ్రాండ్​గా నిర్వహించారు. ఈ వేడుకలకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు భారీగా తరలివచ్చారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ కుటుంబ సమేతంగా విచ్చేసి సందడి చేశారు.

మరోవైపు బాలీవుడ్ బాద్ షా షారుక్​ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్​, రణ్​వీర్ సింగ్​, దీపికా పదుకొణె, సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ, ఆయుషాన్ ఖురానా, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్​, అతియా శెట్టి, రష్మిక, అనన్య పాండే, ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశాల్​, దర్శకుడు అట్లీ, నయనతార విఘ్నేష్ తమ ఫ్యామిలీతో సందడి చేశారు. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news