నేటి నుంచి “గాంధీ” చిత్రం ఉచిత ప్రదర్శన

-

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోసం నేటి నుంచి గాంధీ చిత్రంను ఉచితంగా ప్రదర్శించనున్నారు. ఇవాళ అన్ని జిల్లాల్లో 582 స్క్రీన్ లలో ఉదయం 8 నుంచి 11:30 గంటల వరకు చిత్రాన్ని ప్రదర్శిస్తారు.

16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు చిత్రాన్ని ప్రదర్శిస్తారు. 15వ తేదీన స్వాతంత్ర దినం, 20వ తేదీన ఆదివారం కావడంతో చిత్ర ప్రదర్శన ఉండదు. ఇక ఇటు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది.

ఇవి ఈనెల 15వ తేదీన మాత్రమే అమల్లో ఉంటాయి. పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్ళు దారిన స్త్రీ, పురుషులకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టిసి వెల్లడించింది. వయసు ధ్రువీకరణకు ఆధార్ కార్డు చూపాలని స్పష్టం చేసింది. అదే విధంగా హైదరాబాదులో 24 గంటల అపరిమిత ప్రయాణానికి సంబంధించి టి-24 టికెట్ ను రూ.75కే ఇవ్వనున్నట్లు తెలిపింది. పిల్లలకు టీ-24 టికెట్ ధర 50గా నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news