హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..రేపు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

-

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఆగస్టు 15వ తేదీన గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

పంద్రాగస్టు రోజున ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఆంక్షల సమయంలో రామ్దేవ్ కూడా నుంచి గోల్కొండ కోటకు వచ్చే రోడ్డు పూర్తిగా మూసి వేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక గోల్కొండ పరిసర ప్రాంతాల్లో వాహనాదారులకు పార్కింగ్ సదుపాయం కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news