ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్… !

-

బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసే సినిమాలపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. ప్రభాస్ చేస్తున్న సినిమాపై ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. సాహో సినిమా ఫ్లాప్ అయింది. అయితే వసూళ్లు మాత్రం ఆ సినిమాకు భారీగానే వచ్చాయి. ఆ సినిమా మీద ప్రభాస్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. అయితే ఆ సినిమా దాదాపు 400 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.

ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఏంటీ అనేది ఎవరికి స్పష్టత రావడం లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన గుడ్ న్యూస్ ని చిత్ర యూనిట్ త్వరలో వెల్లడించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త వచ్చినా సరే ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. రెండు పోస్ట‌ర్స్‌ను విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భారీ బ‌డ్జెట్‌తో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తుంది. ఈ సినిమా విడుదల తేదీ టైటిల్ ని కూడా ఆ రోజే ప్రకటిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news