బాలయ్య వ్యాఖ్యల్లో మాకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు – ఎస్వీ రంగారావు మనవళ్లు

-

ఇటీవల జరిగిన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై బాలయ్యపై అక్కినేని ఫ్యాన్స్, కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ వివాదంపై ఎస్వీ రంగారావు గారి మనవళ్లు స్పందించారు. నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవలుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నామని తెలిపారు ఎస్వీ రంగారావు గారి మనవళ్లు.

మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా వుంటాం. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు వుండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నామన్నారు ఎస్వీ రంగారావు గారి మనవళ్లు. ఈ మేరకు ఓ వీడియోను వదిలారు.

Read more RELATED
Recommended to you

Latest news