వారసుడు వచ్చాడు అంటూ పోస్ట్ పెట్టిన హీరో రామ్

-

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇంటికి కొత్త వారసుడు వచ్చాడు అంటూ ట్విట్టర్ లో ఫోటో తో ట్వీట్ చేశాడు. ఎప్పటికప్పుడు సినిమాలతో బిజీ గా ఉండే హీరో రామ్ ఆమధ్య చేసిన ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ టాక్ అందుకుంది. దీనితో ప్రస్తుతం ‘రెడ్’ అనే చిత్రం తో రామ్ బిజీ గా ఉన్నాడు. అయితే తాజాగా తన ఇంటికి మరో కొత్త వారసుడు వచ్చాడు అంటూ ఒక చిన్న పిల్లాడు తో కలిసి దిగిన ఫోటో ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మా ఇంటికి కొత్త వారసుడు వచ్చాడు అని నా ముద్దుల నెఫ్యూ అంటూ ఆ చంటి పిల్లాడితో దిగిన ఫోటో ను ట్విట్టర్ లో పోస్ట్ చేయడం తో ఇది కాస్త వైరల్ అయ్యింది. అయితే రామ్ నెఫ్యూ పేరు సిధ్ధాంత్ పోతినేని అట. అయితే ఇంటికీ కొత్త వారసుడు రావడం తో రామ్ కుటుంబసభ్యులు పండుగ చేసుకుంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో మంచి హిట్ ను కొట్టిన రామ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోగా ఏప్రిల్ 9 న ధియేటర్ల లో రానుంది. ఇటీవల రిలీజ్ అయిన రెడ్ టీజర్ పై కూడా మంచి స్పందన లభించగా ఎప్పుడు ఈ చిత్రం ధియేటర్ల లో వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

తొలిసారిగా రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు ఈ చిత్రంలో. శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై కృష్ణ పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ కు జోడీ గా నివేదా పేతురాజ్,మాళవిక శర్మ,అమృతా అయ్యర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే చాలా కాలం తరువాత మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ కు కూడా మణిశర్మ నే సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా రెడ్ చిత్రం కి కూడా మణిశర్మ నే సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news