వివాదంలో హీరో సాయిధరమ్‌ తేజ్ !

-

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు . ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును చాటుకున్నారు సాయిధరమ్ తేజ్.

ఇక ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న ఈయన గత ఏడాది సెప్టెంబర్ నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నారు. నిన్న శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్న ఆయన… అక్కడి సుబ్రమణ్య స్వామికి స్వయంగా హారతి ఇచ్చారు. ఇదే వివాదాస్పదమైంది. నిబంధనల ప్రకారం స్వామివారికి కేవలం అర్చకులు మాత్రమే హారతి ఇవ్వాలని, సాయి ధరమ్ తేజ్ ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news