విశాఖపట్నం నుండి ఊటీ, కూర్గ్.. ఫ్లైట్ లోనే.. ధర కూడా తక్కువే..!

-

ఏదైనా మంచి టూర్ వేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇదే మీకు గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీ ని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో ఊటీ, మైసూర్, కూర్గ్, బెంగళూరు లోని పర్యాటక ప్రాంతాలను చూసి వచ్చేయచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళ్దాం.. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ఇది. ఆగస్ట్ 10న ఈ టూర్ విశాఖపట్నం నుంచి మొదలు కానుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.25,875, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.26,650, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.35,210 చెల్లించాలి. ఉదయం 7.40 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరితే 9.15 గంటలకు బెంగళూరు రీచ్ అవుతారు.

అక్కడ్నుంచి ఊటీకి వెళ్లాల్సి వుంది. ఊటీ చేరాక హోటల్ కి వెళ్లి రిలాక్స్ అయ్యి… సాయంత్రం ఖాళీ సమయంలో షాపింగ్ చేయొచ్చు. రాత్రికి ఊటీలో ఉండాలి. రెండవ రోజు ఊటీ ఫుల్ డే సైట్‌సీయింగ్. దొడ్డబెట్ట, బొటానికల్ గార్డెన్స్, రోజ్ గార్డెన్, ఊటీ లేక్ చూడొచ్చు. అలానే టీ ఫ్యాక్టరీ చూసి… రాత్రికి ఊటీలో ఉండాలి. మూడో రోజు కూర్గ్ టూర్ ఉంటుంది. బైలుకుప్పె టిబెటియన్ సెటిల్మెంట్, ఎలిఫ్యాంట్ క్యాంప్ దారిలో చూడవచ్చు. రాత్రికి కూర్గ్‌ లో ఉండాలి.

నాల్గవ రోజు సైట్ సీయింగ్. తలకావేరీ, తలకావేరీ ఆలయం, భగమండల, భగందీశ్వర టెంపుల్ చూడవచ్చు. లంచ్ తర్వాత అబ్బే ఫాల్స్, ఓంకారేశ్వర ఆలయం, రాజా సీట్ చూడవచ్చు. రాత్రికి కూర్గ్‌లో ఉండాలి. ఐదో రోజు మైసూర్. మైసూర్ ప్యాలెస్, మైసూజ్ జూ, చాముండీ హిల్స్, చాముండేశ్వరి ఆలయం, బృందావన్ గార్డెన్స్ చూడవచ్చు. రాత్రికి మైసూరులో ఉండాలి. ఇక ఆరో రోజు బెంగళూరు. లాల్‌బాగ్, విశ్వేశ్వరయ్య మ్యూజియం చూసి… సాయంత్రం 4 గంటలకు బెంగళూరు లో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 6.30 గంటలకు విశాఖపట్నం వచ్చేయచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news