SSMB -28 సినిమాలో అలనాటి హీరోయిన్..!!

-

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకు ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండు చిత్రాలలో కూడా నటించారు. మహేష్ బాబు ఇప్పుడు మూడవ సినిమాకి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో హీరోయిన్గా పూజ హెగ్డే నటిస్తోంది. ఇందులో రెండవ హీరోయిన్ కోసం ఇంకా పలు చర్చలు జరుగుతూనే ఉన్నట్లుగా సమాచారం. కానీ కీలకమైన పాత్రలో అలనాటి హీరోయిన్ టబు నటిస్తున్నట్లుగా సమాచారం.

అయితే ఈ చిత్రంలో టబు మహేష్ పైన మోజు పడేటువంటి పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాలలో ఇలాంటి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని చెప్పవచ్చు. కానీ కథ డిమాండ్ చేయడం వల్ల త్రివిక్రమ్ స్వయంగా ఇలాంటి పాత్రను క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం చిత్రంలో తల్లి పాత్ర లో టబు కనిపించింది. ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు.

Mahesh Babu to resume SSMB 28 shoot this month- Cinema expressఇప్పుడు మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో టబు పాత్ర హైలెట్ గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది దసరా కానుకగా ఈ చిత్రం విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుపుకుంటున్నాయి. మహేష్ అభిమానులు పూజా హెగ్డే అభిమానులు ఈ చిత్రం అప్డేట్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ చిత్రానికి సంబంధించి ఇంకా టైటిల్ ని కూడా ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం SSMB -28 చిత్రానికి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news