హీరోయిన్ త్రిష కి ప్రమాదం.. వైరల్ అవుతున్న ఫోటో..!!

-

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ యువ హీరోయిన్లకు పోటీగా తన అందంతో నటనతో అవకాశాలను సంపాదించుకుంటూ వస్తోంది. త్రిష ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి కొన్ని సంవత్సరాలు పైన కావస్తోంది. తాజాగా వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా కూడా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో ఆమె పోషించిన కుందవై పాత్ర అభిమానులను మెప్పించడమే కాకుండా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో మరొకసారి మరింత క్రేజ్ సంపాదించుకుంది త్రిష.

ఇక ఈ సినిమా తర్వాత త్రిష తన రెమ్యూనరేషన్ డబల్ చేసిందనే వార్తలు కూడా చాలా వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం త్రిష చేతినిండా పలు సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా త్రిష తన ఇంస్టాగ్రామ్ నుంచి షేర్ చేసిన ఒక ఫోటో చాలా వైరల్ గా మారుతోంది. ఈ ఫోటో చూసిన అభిమానులు చాలా కంగారు పడుతున్నారు. త్రిష కాలికి పట్టితో ఉన్నటువంటి ఒక ఫోటో షేర్ చేయడం జరిగింది. తాజాగా వెకేషన్ లో ఉన్న త్రిష అనుకోకుండా ప్రమాదానికి గురి కావడంతో ఆమె కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాలికి పట్టి వేసి ఉన్న ఒక ఫోటో తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది.

ఈ ప్రమాదం వల్ల వెకేషన్ మధ్యలోనే వెనక్కి రావలసి వచ్చిందని విషయాన్ని తెలియజేసింది. ఈ ఫోటో చూసిన నెట్టిజంట్ల సైతం త్రిష ఆరోగ్యం గురించి కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. సినీ ప్రేక్షకులు, అభిమానులు మాత్రం త్రిష త్వరగానే కోలుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం త్రిష కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నది.

Read more RELATED
Recommended to you

Latest news