డ్రగ్స్ కేసులో హీరోయిన్ వరలక్ష్మికి నోటీసులు.. షాక్ లో ఫ్యాన్స్..!!

-

టాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేకపోవడంతో పలు చిత్రాలలో నెగిటివ్ రోల్స్ లో కూడా నటించి మెప్పించింది.. పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించిన వరలక్ష్మి తాజాగా కేరళ డ్రగ్స్ కేసు కు సంబంధించి వచ్చి ఎన్ఐఏ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

వరలక్ష్మి వద్ద పీఏగా పనిచేస్తున్న ఆదిలింగం అనే వ్యక్తి డ్రగ్స్ కేసులో కీలకమైన నిందితుడిగా ఉన్నట్లు అధికారులు సైతం గుర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆదిలింగనికి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో కూడా పలు రకాల సంబంధాలు ఉన్నట్లు అధికారుల దగ్గర పలు ఆధారాలు ఉండడంతో దర్యాప్తుని వేగవంతం చేశారు.. ఈ నేపథ్యంలోనే ఆదిలింగంని ఎన్ ఐ ఏ అధికారులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది.. అయితే ఈ డ్రగ్స్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని సిని పరిశ్రమలో కూడా పెట్టుబడి పెట్టినట్లుగా అధికారులు సైతం గుర్తించినట్లు సమాచారం.

అయితే పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసమే నటి వరలక్ష్మికి విచారణలో భాగంగా NIA అధికారులు సైతం సామాన్లు జారీ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకసారిగా కోలీవుడ్ టాలీవుడ్లో సహా ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.. మరి ఎన్ఐఏ అధికారులు విచారణ నేపథ్యంలో తన పీఏ గురించి ఎలాంటి విషయాలు చెబుతారు.. అన్న విషయం అందరిలోనూ ఆసక్తికరంగా మారుతోంది.. మరి ఆదిలింగం వెనుక సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరైనా ఉన్నారా లేకపోతే సినిమా పేరుతో తాను చేసిన పనులేంటి అనే విషయాలు NIA అధికారులు తేల్చే అవకాశం ఉన్నది. మరి ఈ విషయం ఎంత దాకా వెళ్తుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news