తరాలు మారితే టెక్నాలజీ మారుతుంది.. బాలయ్య ఎనర్జీ కాదు: హైపర్‌ ఆది

-

ప్రపంచంలో ఎక్కడికెళ్లినా నేను తెలుగు వాడిని అని గర్వంగా, ధైర్యంగా చెప్పుకొంటున్నామంటే దానికి కారణం నందమూరి తారక రామారావు అని నటుడు హైపర్ ఆది అన్నారు. తెలుగుజాతి గౌరవాన్ని రామారావు కాపాడితే.. ఆయన గౌరవాన్ని బాలకృష్ణ నిలబెడుతూ వస్తున్నారు అని పేర్కొన్నారు. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన బాలయ్య గురించి ఆది మాట్లాడారు.

‘బాలకృష్ణ తిట్టారు.. కొట్టారు’ అంటూ కొందరు వార్తలు రాస్తుంటారు. కానీ, ఆయన కొన్ని వేల మంది పేద ప్రజల బతుకులను నిలబెట్టారు దాని గురించి రాయాలని ఆది సూచించారు. జనరేషన్‌ మారితే మనుషులు మారతారు.. టెక్నాలజీ మారుతుంది.. కానీ, బాలయ్య బాబు ఎనర్జీ మారదు అంటూ పంచ్ డైలాగ్ వేశారు. నందమూరి నటసింహం (బాలకృష్ణ), కొణిదెల కొదమసింహం (పవన్‌ కల్యాణ్‌) కలిసి అసెంబ్లీలో అడుగుపెడితే ఎలా ఉంటుందో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా చూసినా అలానే ఉంటుందన్నారు నటుడు హైపర్‌ ఆది.

Read more RELATED
Recommended to you

Latest news