Maa Elections 2021: ముదురుతున్న “మా” వార్‌.. మహేష్‌బాబుకు రూ.75 వేలు గూగుల్ పే చేసాం: మంచు విష్ణు

-

Maa Elections 2021: మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ మా ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. ఎప్పుడూ లేనంత ఉత్కంఠగా ఈ సారి ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రోజుకో వివాదంతో ఎన్నిక‌ల‌ను కొత్త మలుపు తిప్పుతూ రక్తికట్టిస్తున్నారు. ఒకవైపు విష్ణు ప్యానెల్ మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ లు ఉండ‌గా.. ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతి విమర్శలు శృతిమించు తున్నాయి. వీరికి సపోర్ట్ గా నిలిచే వారు కూడా లైన్ దాటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక అక్టోబర్‌ 10న జరగనున్న ‘మా’ ఎన్నికలలో నువ్వా నేనా అన్నట్లు ప్ర‌చారం జోరుగా సాగుతుంది.

ఈ త‌రుణంలో మా’ ఎన్నికల్లో కొంద‌రు సభ్యులకు డబ్బు ఆశ చూపిస్తున్నారు. ఒక్కో ఓటరుకు రూ.10 వేలు ఇస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత మరికొంత నగదు ఇస్తామని చెబుతురన్నారంటూ మెగా బ్రదర్‌ నాగబాబు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్య‌లపై మంచు విష్ణు మీడియా ముందుకు వచ్చి నాగ‌బాబుకు కౌంటర్ ఇచ్చాడు. మహేష్ బాబుకు గూగుల్ పే ద్వారా 75 వేలు పంపించానని నాగబాబు పై సెటైర్ వేసాడు.

మా ఎన్నికల సంద‌ర్భంగా 14 అంశాలతో కుడిన‌ మేనిఫెస్టోను మంచు విష్ణు గురువారం విడుదల చేశాడు. ఈ సందర్భంలో విష్ణు మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో ఒక్కొక్కరికి రూ. 75 వేలు ఇస్తున్నాం.. రూ.10 వేలు అని నాగబాబు అంటున్నారు. కానీ, అది తప్పు.. మహేష్‌బాబుకు రూ.75 వేలు గూగుల్ పే చేసాం అంటూ సెటైరికల్‌ కామెంట్లు చేవారు మంచు విష్ణు. అలాగే మా భవనం కు ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే అది మా స్వంత డబ్బులతోనే కడతాను అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news