బాల కృష్ణకు రాశులు, గ్రహాలు వర్క్ ఔట్ అవ్వలేదనుకుంటా.. తమ్మా రెడ్డి

-

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ పోస్ట్ చేస్తున్న ఆహా కార్యక్రమానికి వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయంపై రాజకీయ కోణంలో చూస్తూ పలు సందేహాలు నిలబడుతున్న సంగతి కూడా తెలిసిందే ఈ షోలో రాజకీయం కోసం పలు విషయాలు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను అడగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ విషయంపై స్పందించారు దర్శకని నిర్మాత తమ్మా రెడ్డి భరద్వాజ..

అన్‌స్టాపబుల్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం రాజకీయ కోనమే అంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై స్పందించారు తమ్మారెడ్డి భరద్వాజ.. అలాగే ‘అన్‌స్టాపబుల్’ లాంటి కామెడీ షోలో రాజకీయం గురించి ఎలా మాట్లాడతారని భరద్వాజ ప్రశ్నించారు. ‘‘జనాన్ని ఎంటర్‌టైన్ చేసే షో అన్‌స్టాపబుల్. బాలకృష్ణ ఒక లెజెండ్ కాబట్టి ఆయన ఎవరిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారని ఎగబడి చూస్తున్నాం. బాలకృష్ణ చిలిపిగా ప్రశ్నలు వేస్తుంటే మనకు ఇంకా మజా వస్తుంది. దాంట్లో రాజకీయం ఇన్‌క్లూడ్ చేయిస్తారు అనుకుంటే మనకన్నా పిచ్చోళ్లు ఎవరుంటారు. నేనైతే దాన్ని అస్సలు నమ్మను.. అలాగే బాలకృష్ణ గ్రహాలు, రాశులు నమ్ముతారు. ఆయన శాస్త్రంతో వెళ్తుంటారు. ప్రతిదానికి ఆయనే ముహూర్తం పెట్టుకుంటారు. ఓపెనింగ్, క్లోజింగ్, సినిమా రిలీజ్ ఇలా అన్నింటికీ రఫ్‌గా ఆయనే ముహూర్తం పెడతారు. అందుకే గ్రహాలు, రాశులు వర్కౌట్ అవ్వక సంక్రాంతికి రిలీజ్ కావాలని ఆయన అడిగి ఉండొచ్చు. చిరంజీవికి ఎప్పుడూ పండగ సీజన్‌లో సినిమాలు వస్తుంటాయి కాబట్టి ఆయన కూడా ఈసారి ఉండాలని అనుకుని ఉంటారు. ఇద్దరూ మాస్ హీరోలు.. ఎప్పుడు రిలీజ్ చేసినా ఆడతాయి.. ప్రొడ్యూసర్‌కి నష్టమేముంది. అంతేతప్ప దానిలో ఇంకేమీ లేదు. ‘వీరసింహారెడ్డి’ మొన్నటిదాకా షూటింగ్ జరుగింది. డిసెంబర్ ఆఖరిలో షూటింగ్ జరిగింది. అలాంటిది ఎలా రిలీజ్ అవుతుంది డిసెంబర్‌లో. కాబట్టి నిజాలు తెలియకుండా మనం మాట్లాడకూడదు” అంటూ చెప్పకు వచ్చారు..

Read more RELATED
Recommended to you

Latest news