టాలీవుడ్‌ నటుడు సునీల్‌కి మరో బంపరాఫర్

-

టాలీవుడ్‌ స్టార్‌ నటుడు సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్‌ ప్రారంభంలో కమెడీయన్‌ గా తర్వాత హీరోగా, ఇప్పుడు విలన్‌ గా ముందుకు సాగుతున్నాడు. అయితే, సునీల్ కెరియర్ ని పుష్ప సినిమా అనూహ్య మలుపు తిప్పిందని చెప్పుకోవడంలో సందేహమే లేదు.

ఇప్పుడు లేటెస్ట్ గా కోలీవుడ్ నుంచే మరో అదిరిపోయే ఛాన్స్ ని అతను అందుకున్నాడు. తమిళ హీరో విశాల్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ‘మార్క్ ఆంటోనీ’ సినిమాలో సునీల్ ఓ మేజర్ రోల్ లో నటించే ఆఫర్ ని పొందాడు. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news