వాళ్ళతో సన్నిహితంగా ఉంటేనే ఛాన్సులు ..హీరోయిన్ శ్రద్దా దాస్

-

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సౌత్ మొత్తం ఈ యంగ్ హీరో ఆత్మహత్య సంచలనం గా మారింది. సుశాంత్ మరణం తర్వాత రక రకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తూ చర్చలకు దారి తీస్తున్నాయి. అంతేకాదు సుశాంత్ కి సపోర్ట్ గా ఇప్పటికే ప్రకాష్ రాజ్ లాంటి అగ్ర నటుడితో పాటు పలువు టాలీవుడ్ బాలీవుడ్ నటులు నిలిచిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో కొంతమంది బడా నిర్మాతలు హీరోలు సుశాంత్ కి అవకాశాలు రాకుండా చేశారని..అతన్ని మానసింకంగా కృంగదీశారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

అంతేకాదు ఈ దారుణమైన సంఘటనతో బాలీవుడ్ లో ఇంతకాలం జరుగుతున్న అరాచకాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ లో కొందరు నటుల మీద టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్ శ్రద్ధా దాస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో జరిగే అఘాయిత్యాలు, అక్కడ చూపించే బంధు ప్రీతి…ఇతర కారణాలతో మానసింగా హింసించే వాళ్ళ గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

బాలీవుడ్ లో కొత్త వారికి ఆఫర్లు రావాలంటే ముంబయిలోని బాంద్రా, జుహూ ప్రాంతాల్లో జరిగే నైట్ పార్టీలు.. పబ్ పార్టీలకు హాజరు అవ్వాలని ..అక్కడ ఉండే కొందరితో చనువుగా ఉంటేనే ఆఫర్లు ఇస్తారని తెలిపింది. అలాంటి వాళ్ళకి దూరం ఉంటే మాత్రం ఇండస్ట్రీలో ఛాన్స్ లు రాకుండా చేస్తారని బయట పెట్టింది. అంతేకాదు సినిమాల్లో ఛాన్స్ లు కావాలంటే పీఆర్ మేనేజర్లతో సన్నిహితంగా ఉండాల్సిందేనని శ్రద్దాదాస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇప్పుడు శ్రద్దాదాస్ చేసిన ఈ సెన్షేషనల్ కామెంట్ తో మరోసారి రచ్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news