నైట్ క‌ర్ఫ్యూ ఎత్తివేస్తేనే ల‌వ్ స్టోరీ వ‌స్తుదంట‌!

-

ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా సినిమా ఇండ‌స్ట్రీ కుదేలైంది. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక పూట కర్ఫ్యూతో పాటు నైట్ కర్ఫ్యూలు కొన‌సాగుతున్నాయి. కాగా మెల్ల‌మెల్ల‌గా లాక్ డౌన్ పూర్తి రిలీఫ్ కావ‌డంతో 50శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేట‌ర్లు ఓపెన్ చేసుకోవచ్చనే సంకేతాలు వెలువ‌డ్డాయి. కానీ ఇలాగే రాత్రిపూట కూడా కర్ఫ్యూలు కొన‌సాగిస్తే వేసవిలో విడుదలయ్యే సినిమాల‌కు స‌మ‌స్య‌లు ఎదుర‌వ‌డం ఖాయం.

అయితే ఇదే క్ర‌మంలో శేఖర్ కమ్ముల డైరెక్ష‌న్ లో తెర‌కెక్కించిన చైతన్య సాయి పల్లవి జంట‌గా న‌టించిన లవ్ స్టోరి విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటే నాని టక్ జగదీష్ కూడా విడుద‌ల చేసేందుకు చ‌ర్చిస్తున్నారు. ఇవి రెండు క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఇక వీటిని త్వ‌ర‌లోనే రిలీజ్‌చేస్తార‌ని తెలుస్తోంది.

అయితే లవ్ స్టోరీ నిర్మాతలు మాత్రం ఖ‌చ్చితంగా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే థియేటర్లలో రిలీజ్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. సినిమాను మూడు ఆటలతో ఆడించ‌లేమని ఖ‌చ్చితంగా నాలుగు ఆట‌లు ఉండాల్సిందే అంటూ చెబుతున్నారు. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే వీటిని రిలీజ్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు నిర్మాత‌లు. జులై రెండో వారం తర్వాత‌నే ట‌క్ జ‌గ‌దీశ్ రిలీజ్‌చేస్తార‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news