ఆమె వల్లే భానుప్రియ జీవితం మూగబోయిందా..?

-

ప్రముఖ స్టార్ హీరోయిన్ భానుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. అందమైన మోము.. ఆ మోముకు తగ్గట్టుగా చారడేసి కళ్ళు… ఆ కళ్ళను చూడగానే పరవశించిపోయే యువత..ఇలా తన నటనతో అందంతో అందరిని ఆకట్టుకున్న ఈమె టాలీవుడ్ లో ఒక మంచి హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ముఖ్యంగా సీనియర్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో ఎక్కువగా కనిపించేది భానుప్రియ. సితార సినిమాలో తన అందంతో అందరినీ ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత తెలుగు స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది. భానుప్రియ ఒక హీరోయిన్ మాత్రమే కాదు అంతకుమించి గొప్ప డాన్సర్ కూడా.

భరతనాట్యంలో అందవేసిన చేయి.. వెంకటేష్ , చిరంజీవి లాంటి స్టార్ హీరోలు కూడా భానుప్రియ తో డాన్స్ చేయలేమని చెప్పారు అంటే ఈమె ఎంత గొప్ప డాన్సరో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా డైరెక్టర్ వంశీ , భానుప్రియ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థాయికి చేరుకున్నారు. ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే అప్పటికే వంశీకి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. ఇకపోతే భానుప్రియ తల్లికి ఈ విషయం తెలియడంతో ఆమె వీరి ప్రేమకు అడ్డుకుంది. అంతే కాదు ఇద్దరికీ వార్నింగ్ కూడా ఇచ్చింది. నీకు ఆల్రెడీ పెళ్లయి పిల్లలు ఉన్నారు నువ్వు నీ కెరియర్ మీద దృష్టి పెట్టు అని వంశీకి చెబుతూనే.. మరొకవైపు తన కూతురికి కూడా బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది.

దీనితో వంశీ , భానుప్రియ ఎడబాటు తట్టుకోలేక ఎంతో ఆవేదనకు గురయ్యారు. ఇక ఆయన కెరియర్ కూడా గాడి తప్పింది. ఆ తర్వాత భానుప్రియ అమెరికాకు చెందిన ఎన్నారై ను పెళ్లి చేసుకున్నా.. అతడి టార్చర్ భరించలేక విడాకులు ఇచ్చి ఇండియాకు వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే భానుప్రియ జీవితంలో ఆమె తల్లి బద్ధ శత్రువుగా మారిందని చెప్పవచ్చు. ఇక తల్లి సరైన గైడెన్స్ ఇవ్వకపోవడం వల్లే భానుప్రియ జీవితం మూగబోయింది.

Read more RELATED
Recommended to you

Latest news