నాగ చైతన్య “లవ్ స్టోరీ” తట్టుకుంటుందా …?

-

అక్కినేని నాగ చైతన్య మజిలీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. నిజ జీవితంలో భార్య భర్తలైన నాగ చైతన్య సమంత ఈ సినిమాలోను భార్యా భర్తలుగా నటించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి జాను సినిమాలో కలిసి నటించాల్సి ఉండగా నాగ చైతన్య ఆసక్తి చూపించకపోవడంతో సమంత మాత్రమే నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాట లేకపోయింది. మజిలీ, ఓ బేబి తర్వాత హ్యాట్రిక్ హిట్ గా నిలుస్తుందనుకున్న జాను సినిమా సమంతకి షాకిచ్చింది.

 

ఇక నాగ చైతన్య ఈ సినిమా తర్వాత క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ లో సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయినట్లు మూడు నెలల క్రితమే అన్నారు. ఇక ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లో 19వ సినిమా కావడం విశేష. ఈ సినిమాలో చైతూ కి జంటగా సాయిపల్లవి నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన ఈ పోస్టర్‌, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఉగాది కే రిలీజ్ చేయాలనుకున్నారు.

కాని కరోనా కారణంగా సాధపడలేదు. అంతేకాదు ఇంకా ఈ సినిమాకి సంబంధించిన వర్క్ పెండింగ్ ఉందట. ప్రస్తుత లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధిన కార్యక్రమాలేవి జరగడం లేదట. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యో సరికి చాలా సినిమాలు పోటీగా ఉన్నాయి. అసలే భయాందోళనతో జనాలు థియోటర్స్ కి వస్తారా అన్నది మిలియన్ డాలర్స్ ప్రశ్నగా ఉంది. దీనికి తోడు నాని ” వి”, అనుష్క “నిశబ్ధం”, పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్”, రవితేజ “క్రాక్” .. ఇలా భారీ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా ఏమో సున్నితమైన ప్రేమ కథ గా తెరకెక్కింది. అందులోను సాయి పల్లవికి ఫిదా తర్వాత మళ్ళీ హిట్ దక్కలేదు. దీంతో ఈ భారీ సినిమాల మధ్య లవ్ స్టోరీ తట్టుకొని నిలబడుతుందా .. అసలు రిలీజ్ చేసే అవకాశం దొరుకుతుందా అని ఫిల్మ్ నగర్ లో చర్చ సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news