ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఇంతగానా ..?

-

మొదటి సినిమాతోనే జాతీయ అవార్డ్ ను సాధించుకున్న హీరోయిన్ ప్రియమణి. ఆ తర్వాత పెళ్ళైన కొత్తలో అంటూ జగపతి బాబు తో నటించిన సినిమాతో టాలీవుడ్ దృష్ఠిలోనే కాదు దర్శక ధీరుడు రాజమౌళి, పూరి జగన్నాధ్ లాంటి స్టార్ డైరెక్టర్స్ ని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో సూపర్ హిట్ సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా మంచి పాపులారిటీని సాధించింది.

 

ఆ తర్వాత పెళ్ళి చేసుకొని సినిమాలకి దూరంగా ఉన్న ప్రియమణి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో చేస్తున్న రెండు సినిమాలు దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలతో చేస్తుండటం విశేషం. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ రీమేక్ లో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నారప్ప టైటిల్ తో తెలుగులో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు. సురేష్ బాబు నిర్మిస్తున్నారు.

 

అలాగే సురేష్ బాబు తనయుడు రానా దగ్గుబాటి హీరోగా విరాటపర్వం తెరకెక్కుతుంది. ఈ సినిమాలోను ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ ఒకరికి ఒకరు పోటీ పడి ఈ సినిమాలో నటిస్తున్నారట. అందులో భాగంగా మొదటిసారి నక్సలైట్ గా నటిస్తున్న ప్రియమణి ఆ పాత్రని వంటబట్టించుకోవడానికి ఏకంగా మాజీ నక్సలైట్స్ తో కొన్నాళ్ళు ట్రావెల్ చేసిందని పాత్ర స్వభావం పూర్తిగా తెలుసుకుందని అంటున్నారు.

మొత్తానికి ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సస్ అవడానికి చాలానే శ్రమిస్తోంది. ఇక ఈ రెండు సినిమాలతో పాటు మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న ప్రియమణికి టాలీవుడ్ సీనియర్ హీరోల సరసన నటించడానికి చర్చలు జరుగుతున్నాయని తాజా సమాచారం. ముఖ్యంగా వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి లాంటి వాళ్ళకి హీరోయిన్స్ సమస్య బాగా ఎదురవుతుంది. అయితే ఆ సమస్య ప్రియమణికి మంచి ఛాన్స్ అని చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news