అతని వల్లే ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టిన అనుష్క.. నిజమేనా..?

-

ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై తన నటనతో అందరి మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరితో కూడా కలిసి నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. అరుంధతి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించిన అనుష్క.. బాహుబలి వంటి పాన్ ఇండియా చిత్రాలతో కూడా మరొకసారి తానేంటో నిరూపించుకుంది.

ఇకపోతే బాహుబలి సినిమా తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆమెకు అవకాశాలు రాలేదు. చివరిగా నిశ్శబ్దం సినిమాలో నటించి వెండితెరకు దూరమైన అనుష్క.. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. తాజాగా సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో సొంత ఎంపికతో స్పాట్లైట్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నవీన్ పోలిశెట్టి మాత్రమే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

అనుష్క ఏ మాత్రం సినిమా ప్రమోషన్స్ కి పాల్గొనక పోవడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రమోషన్స్ లో పాల్గొనక పోవడానికి కారణం ప్రభాస్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ప్రభాస్తో తనకు చాలా కాలంగా ఉన్న సంబంధం గురించి విచారణలను పక్కన పెట్టాలని ఆమె కోరుకుంటుంది. మరొకవైపు మీడియా ముందుకు రావడానికి ఆమె వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో అందుకే ప్రమోషన్స్ కి రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news