పాకిస్తాన్ VS నేపాల్ మ్యాచ్ పై ఆసక్తి చూపని ప్రేక్షకులు … !

-

ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభం అయిన ఆసియా కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ పాకిస్తాన్ మరియు నేపాల్ జట్లు తలపడుతున్నాయి. మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్వల్ప సమయంలోనే రెండు వికెట్లు కోల్పోయిన టీం ను బాబర్ మరియు రిజ్వాన్ లు ఆదుకుని జట్టును గట్టున పడేశారు. కాగా ఈ మ్యాచ్ పాకిస్తాన్ లోని ముల్తాన్ స్టేడియం లో జరుగుతోంది.. కానీ ఎందుకో తెలియదు ప్రేక్షకులు ఈ మ్యాచ్ పై అంత ఆసక్తి చూపలేదని స్పష్టంగా ఆర్దమవుతోంది. మాములుగా ముల్తాన్ స్టేడియం లో ఎంతో సౌకర్యవంతంగా 30 వేలకు పైగానే కూర్చోవచ్చు. కానీ చాలా తక్కువ సంఖ్యలో మ్యాచ్ ను వీక్షించడానికి ప్రేక్షకులు రావడం నిజంగా ఐసీసీ కి మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు షాక్ అని చెప్పాలి.

ఇందుకు రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.. పాకిస్తాన్ ఆర్ధికంగా చాల దిగజారడం మరియు నేపాల్ తో మ్యాచ్ కావడం వలన ప్రేక్షకులు రాలేదని అనుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news