జబర్దస్త్ కు రోజా రీ ఎంట్రీ.. హైపర్ ఆది, సుధీర్ లకు గుండె గుబేల్..!

-

ఎలక్షన్స్ టైంలో రోజా, నాగబాబు జబర్దస్త్ కు దూరమైన విషయం తెలిసిందే. ఏపి ఎలక్షన్స్ లో నాగబాబు జనసేన తరపున నరసాపురం ఎంపిగా పోటీ చేయగా.. రోజా వైసిపి అభ్యర్ధిగా నగరి నుండి నిలుచుంది. ఎన్నికల టైంలో జబర్దస్త్ టీం అంతా నాగబాబుకి సపోర్ట్ గా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ విషయంలో రోజా జబర్దస్త్ టీం మీద చాలా సీరియస్ గా ఉందని తెలిసిందే. జబర్దస్త్ లో రోజా, నాగబాబు ఇద్దరు జడ్జులుగా వ్యవహరించారు. అయితే ఎలక్షన్స్ లో కేవలం నాబాబుకి సపోర్ట్ గా మాత్రమే ప్రచారం చేయడంపై రోజా చాలా సీరియస్ గా ఉన్నారట.

అయితే ఎన్నికల ఫలితాలకు ఇంకా చాలా టైం ఉన్నందున రోజా మళ్లీ జబర్దస్త్ కు రాబోతుందని తెలుస్తుంది. రోజా రావడం కన్ఫాం అని తెలిసిన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లకు వణుకు మొదలైందని తెలుస్తుంది. జడ్జులుగా ఇద్దరం సమానమైనప్పుడు కేవలం నాగబాబు తరపున మాత్రమే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై రోజా తీవ్ర అసహనంలో ఉన్నారట. మరి రోజా జబర్దస్త్ రీ ఎంట్రీ హైపర్ ఆది, సుధీర్ లు ఎలా ఫేజ్ చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news