తండ్రిని మర్చిపోలేకపోతున్న జబర్దస్త్ బ్యూటీ.. ఏం చేసిందంటే..!

-

జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక గుర్తింపు క్రియేట్ చేసుకున్న రీతు చౌదరి సినిమాలలో నటించకపోయిన సరే భారీ పాపులారిటీని అందుకుంది . ముఖ్యంగా జీ తెలుగులో ప్రసారమయ్యే సరిగమపలో సింగర్ యశస్విని హగ్ చేసుకుని ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది రీతూ చౌదరి. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అక్కడ లేడీ కమెడియన్ గా పేరు సంపాదించుకొని ఇప్పుడు జబర్దస్త్ రీతూ చౌదరిగా మారిపోయింది.

ఒకప్పుడు జీ తెలుగులో కూడా ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈమె బుల్లితెర స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఇక తనదైన అందంతో పాటు హాట్ నెస్ ఆరబోస్తూ.. హీరోయిన్ రేంజ్ లో వయ్యారాలు వలకబోస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఇక అంతేకాదు హాట్ హాట్ వీడియోలు ,రీల్స్ చేస్తూ, టీవీ షోలు, షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్, ఇంస్టాగ్రామ్ యాడ్స్ చేస్తూ రెండు చేతుల బాగానే సంపాదిస్తుందని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఆమె తండ్రి మరణించిన విషయం తెలిసిందే.

తండ్రి మరణం తర్వాత కూడా ఆమె నెగిటివిటీకి కూడా గురై ట్రోల్స్ ఎదుర్కొంది. తండ్రి మరణించిన మరుసటిరోజే గ్లామర్ ఫోటోషూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో అందరూ ఈమెను బాగా ట్రోల్ చేశారు. అయితే ఇప్పటికీ ఆమె తన తండ్రిని మరిచిపోలేకపోతోంది. ఈ క్రమంలోనే షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేమిటంటే తన తండ్రితో కలిసి ఉన్నప్పుడు నివసించిన ఇంటిని కాళీ చేయాలని నిర్ణయం తీసుకుందట . తండ్రి జ్ఞాపకాల నుంచి దూరంగా ఉండాలంటే ఆ ఇంటి నుంచి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆమె అద్దె ఇంట్లో ఖాళీ చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాదు ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో రిలీజ్ చేసి ఈ విషయాన్ని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news