మీ కోస‌మే నేను అలాంటి దుస్తులు ధ‌రిస్తున్నా.. జాన్వీ క‌పూర్ షాకింగ్‌ కామెంట్లు..!

-

మీరు ఫొటోలు తీసుకుంటార‌ని తెలిసే నేను అలాంటి బ‌ట్ట‌లు వేసుకుని వ‌స్తున్నా. రోజూ మీ ఫొటోల కోసం నేను అలా త‌యారు కావ‌ల్సి వ‌స్తోంది.. అంటూ జాన్వీ ఫొటోగ్రాఫ‌ర్ల ఎదుట‌ షాకింగ్‌ కామెంట్లు చేసింది.

ప్ర‌ముఖ నటి శ్రీ‌దేవి కుమార్తె జాన్వీ క‌పూర్ గురించి ఎవ‌రికీ పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టించింది ఒక్క సినిమాలోనే అయినా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల‌కు తగిన ఇమేజ్‌ను ఆమె సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే గ‌తేడాది ఆమె న‌టించిన ద‌ఢ‌క్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాగా జాన్వీ న‌ట‌న‌కు విమర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ద‌క్కాయి. దీంతో ఆమెకు ఆఫ‌ర్లు వ‌రుస‌గా వ‌స్తున్నాయి. అయితే న‌ట‌న ప‌రంగానే కాదు, అందం, ఆరోగ్యం విష‌యంలోనూ జాన్వీ చాలా కేర్ తీసుకుంటుంది. అందులో భాగంగా ఆమె నిత్యం జిమ్‌కు వెళ్తుంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా జిమ్‌కు వెళ్లిన జాన్వీకి ఓ ఫ‌న్నీ సంఘ‌ట‌న ఎదురైంది. అదేమిటంటే…

జాన్వీ ఈ మ‌ధ్య ఒక రోజు య‌థావిధిగానే జిమ్ కు వెళ్ల‌గా అక్క‌డే ఉన్న ఫోటొగ్రాఫ‌ర్లు ఆమెను క్లిక్‌మ‌నిపించారు. దీంతో ఆ ఘ‌ట‌న‌కు స్పందించిన జాన్వీ మాట్లాడుతూ.. ”మీరు ఫొటోలు తీసుకుంటార‌ని తెలిసే నేను అలాంటి బ‌ట్ట‌లు వేసుకుని వ‌స్తున్నా. రోజూ మీ ఫొటోల కోసం నేను అలా త‌యారు కావ‌ల్సి వ‌స్తోంది..” అంటూ జాన్వీ ఫొటోగ్రాఫ‌ర్ల ఎదుట‌ షాకింగ్‌ కామెంట్లు చేసింది. దీంతో ఇప్పుడు జాన్వీ కామెంట్లు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

కాగా జాన్వీ ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ నిర్మాణంలో తెర‌కెక్కుతున్న ఓ చిత్రంలో న‌టిస్తోంది. అందులో జాన్వీ.. గుంజ‌న్ స‌క్సేనా పాత్ర‌లో న‌టిస్తోంది. 1999లో జ‌రిగిన కార్గిల్ యుద్ధంలో గుంజ‌న్ స‌క్సేనా ప్ర‌దర్శించిన‌ ధైర్య సాహ‌సాల‌ను ఈ సినిమాలో చూపిస్తున్నారు. అలాగే థ‌క్త్ అనే మ‌రో చిత్రంలోనూ జాన్వీ న‌టిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version