punith : పునీత్ లాస్ట్ మూవీ ‘జేమ్స్’టీజర్

-

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల… మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన పునీత్ రాజ్ కుమార్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందారు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదం లో కి వెళ్ళింది. ఆయన మృతి వార్తను ఇప్పటికి ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇది ఇలా ఉండగా.. పునీత్‌ రాజ్‌ కుమార్‌ నటించిన చివరి చిత్రం జేమ్స్‌ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా విడుదలకు కూడా సిద్ధమైందని చిత్ర బృందం ప్రకటన చేసింది. రిపబ్లిక్‌ డే సందర్బంగా జేమ్స్‌ స్పెషల్‌ పోస్టర్‌ ను విడుదల చేశారు.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఇవాళ పునీత్‌ చివరి సినిమా జేమ్స్‌ టీజర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌గా, శ్రీకాంత్‌ విలన్‌ గా నటించారు. అలాగే చేతన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఇక ఇవాళ రిలీజ్‌ అయిన టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news