చిరంజీవి సినిమా అయినా బేరాల్లేవమ్మ అంటున్న కాజల్…!

-

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తున్నారు. సైరా మూవీ తరువాత చిరంజీవి నటిస్తున్న152 వ చిత్రం ఈ ఆచార్య. ఈ సినిమా విడుదలకు ముందే రోజుకో రకం గా సినీ పరిశ్రమ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. మొన్నటి వరకు చిరు పక్కన త్రిష నీ హీరోయిన్ గా అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల త్రిష ఈ చిత్రం నుంచి తప్పుకుంది.

అయితే ఆ లక్కీ ఆఫర ను కాజల్ సొంతం చేసుకుంది. అంతే కాదు ఇప్పుడు ఈ చిత్రం లో యాక్ట్ చేస్తున్నందుకు కాజల్ తీసుకున్న పారితోషకం తెలిసి సినీ వర్గాలు నోరెళ్ళబెట్టాయి. ఈ చిత్రానికి ఏకంగా కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటుందట కాజల్‌. అంతే కాకుండా జీఎస్టీ, రవాణా, హోటల్ ఖర్చులు సంగతి మామూలే. కొత్త హీరోయిన్ ల హవా నడుస్తున్న ఈ రోజుల్లో డిమాండ్ తగ్గినా కూడా కాజల్‌ అందుకున్న,

ఈ రేంజ్ రెమ్యునరేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు అందరూ. ఇదంతా చూస్తే ఇండస్ట్రీలో కాజల్ హవా ఇంకా నడుస్తుంది అని అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెడతారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news