ఐక్యరాజ్యసమితి వేదికపై అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న కాంతారా..

-

కన్నడ సినిమా కాంతారకు అరుదైన గౌరవం లభించనుంది. స్విజర్లాండ్ లో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో కాంతారా స్క్రీనింగ్ కానుంది. ఈ విషయాన్ని రిషభ్ శెట్టి స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న ఈ స్ట్రీమింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చినా కాంతారా సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఆర్ఆర్అర్, కె.జి.ఎఫ్ 2 లతో సమానంగా సంచలనం సృష్టించింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు అందకుండా రికార్డులు బద్దలు కొట్టింది. కర్ణాటకలో సంస్కృతిని ప్రతిబింబించేలా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని కదిలించిందని చెప్పాలి. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తాజాగా మరొక అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.

అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితిలో కాంతార చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. స్విట్జర్లాండ్ లో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో కాంతారా స్క్రీనింగ్ జరగనుంది. ఈ స్క్రీనింగ్ అనంతరం రిషిప్ శెట్టి ప్రసంగించాను ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఎలా భాగం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ వంటి అంశాలకు సంబంధించిన విషయాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news