శైలజ రెడ్డి అల్లుడుపై కేరళ వరదల ఎఫెక్ట్..!

-

అక్కినేని నాగ చైతన్య హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. అసలైతే ఆగష్టు 31న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 13కి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ కు కారణం కేరళ వరదలని తెలుస్తుంది. కేరళలో వరదలకు శైలజా రెడ్డి రిలీజ్ కు సంబందం ఏంటంటే ఈ సినిమా మ్యూజిక్ డైరక్టర్ గోపి సుందర్ కేరళకు చెందిన సంగీత దర్శకుడే. ఆయన స్టూడియోలు అక్కడే ఉన్నాయి.

సినిమాకు ఆర్.ఆర్ అక్కడే కంపోజ్ చేయాల్సి ఉంది. కాని వరదల వల్ల అక్కడ వర్క్ ఇబ్బంది అవుతుంది. అందుకే శైలజా రెడ్డి అల్లుడు సినిమాను వాయిదా వేస్తున్నట్టు చెబుతున్నారు. చైతు సరసన అను ఎమ్మాన్యుయెల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో శైలజా రెడ్డిగా టైటిల్ రోల్ పోశిస్తుంది శివగామి రమ్యకృష్ణ.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమా టీజర్ తో ఇంప్రెస్ చేయగా మరి అనుకున్న విధంగా సెప్టెంబర్ 13న వచ్చి ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version