కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించిన ఖర్గే.. తెలంగాణకు నో ఛాన్స్..!

-

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని (సీడబ్ల్యూసీ) ఇవాళ 39 మందితో ఖర్గే  ఏర్పాటు చేశారు. అయితే సీడబ్య్యూసీ తెలంగాణకు ప్రాధాన్యత దక్కలేదు. ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లం రాజు, వంశీ చందర్ రెడ్డి, శాశ్వత ఆహానితులుగా  సుబ్బి రామిరెడ్డి, కొప్పుల రాజు, దామోదర రాజ నరసింహాలకు స్థానం దక్కింది. తెలంగాణకు సీబ్ల్యూసీకి పెద్దగా ప్రాధానత్య ఇవ్వలేదు. మల్లి కార్జున ఖర్గే బాధ్యతలను తీసుకున్నారో అప్పుడే స్టీరింగ్ కమిటీతో ఇప్పటి వరకు కార్యక్రమాలను నిర్వహించారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణను చిన్న చూపు చూశారు. ఎన్నికలు ఉన్న సమయంలో కీలక నేతలకు అవకాశాలు దక్కుతాయని భావించినా వీరికి కమిటీ ఛాన్స్ ఇవ్వలేదు. కేవలం శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్ కి చెందిన రఘువీరారెడ్డికి మాత్రం సీడబ్ల్యూసీ లో అవకాశం కల్పించారు. తెలంగాణలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ ఎవ్వరినీ ప్రకటించలేదు. తెలంగాణ పై ఎందుకు వివక్ష చూపారని అందరూ చర్చించుకుంటున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, సంపత్, దామోదర రాజనరసింహకు ఛాన్స్ ఇస్తారని ఆశించారు. అయితే దామోదర నరసింహకి శాశ్వత ఆహ్వానితులుగా ప్రకటించడం గమనార్హం. 

  

Read more RELATED
Recommended to you

Latest news