కశ్మీర్‌లో విజయ్ దేవరకొండ, సమంత..‘ఖుషి’ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా తెరకెక్కుతున్న లవ్ స్టోరి ‘‘ఖుషి’’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ ‘హృదయం’ ఫేమ్ అబ్దుల్ వాహిబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

న్యూఏజ్ లవ్ స్టోరిగా ‘ఖుషి’ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ ను ఈ ఫిల్మ్ కు పెట్టడం ద్వారా ఈ పిక్చర్ పై అంచనాలు ఇంకా పెరిగాయి. కాగా, అప్పుడే ఈ చిత్ర అప్ డేట్ ఇచ్చేశారు డైరెక్టర్ శివ.

కశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్లు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఇందుకు సంబంధించిన ఫొటోలు విడుదల చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా గతంలో ‘మహానటి’ చిత్రంలో కనిపించారు. కాగా, ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్ లవ్ స్టోరిలో నటిస్తున్నారు. ‘‘టక్ జగదీశ్’’ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఖుషి’ కాగా, ఈ పిక్చర్ పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news