యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఖుషి టీమ్

-

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఖుషి టీమ్…దర్శించుకుంది. స్వామివారిని బ్రేక్ టైం లో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు, ఖుషి సినిమా టీం సభ్యులు.

Khushi team visited Yadadri Shri Lakshmi Narasimha Swamy
Khushi team visited Yadadri Shri Lakshmi Narasimha Swamy

యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సుల వల్లే మా అన్నదమ్ముల సినిమాలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయని ఈ సందర్భంగా అన్నారు హీరో విజయ్ దేవరకొండ. తమ్ముడు ఆనంద్ దేవరకొండ, కుటుంబ సభ్యులు, ఖుషి సినిమా యూనిట్ సభ్యులతో కలిసి బ్రేక్ దర్శనం టైం లో శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు విజయ్ దేవరకొండ, ఖుషి సినిమా యూనిట్.

కాగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటించిన సినిమా ఖుషి. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ ఇద్దరికి ఖుషి చిత్రం కాస్త ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్​ను సంపాదించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news