పవన్ కల్యాణ్ సినిమాకి నో చెప్పిన కైరా అద్వాని.. ఎందుకో తెలుసా..?

-

ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి కెమెరా ముందుకు రావడం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. పార్టీ, కుటుంబ ఆర్థిక పరిపుష్టి కోసమే సినిమాలు తీస్తున్నానని చెప్పిన ఆయన.. మళ్లీ ముఖానికి రంగేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పటికే ‘పింక్’ రీమేక్ షూటింగ్‌లో షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన.. ఇటీవలే క్రిష్ దర్శకత్వంలోనూ మరో సినిమా స్టార్ట్ చేసేశారు. ఈ సినిమాలో బందిపోటుగా పవన్ కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరికీ ఛాన్స్ ఇస్తారనే దానిపై చర్చలు ఊపందుకున్నాయి.

ఆయన సరసన కథానాయికగా కైరా అద్వానిని తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ జంట మధ్య కెమిస్ట్రీ అదిరిపోతుందని అభిమానులు భావించారు. అయితే వాళ్లకి నిరాశను కలిగిస్తూ ఆమె నో చెప్పేసింది. బాలీవుడ్లో భారీ సినిమాలతో బిజీగా వున్న కైరా, ప్రస్తుతం డేట్లు ఖాళీ లేవని చెప్పిందట. దాంతో వాణీ కపూర్ ను ఎంపిక చేసే ఆలోచనలో క్రిష్ వున్నాడని అంటున్నారు. 2014లో వచ్చిన ‘ఆహా కల్యాణం’లో నాని జోడీగా వాణీ కపూర్ కనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news