ఆచార్య‌పై క్రేజ్ పెంచేందుకు కొర‌టాల ప్లాన్‌.. ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్‌!

-

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి స్థాయి సినిమా రాలేదు. కానీ మొద‌టి సారి కొర‌టాల ఆ ధైర్యం చేసి వీరిద్ద‌రి కాంబోలో సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. అస‌లే బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన కొర‌టాల ఈ సారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అని అంతా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు క‌రోనా క‌రాణంగా ఆ సినిమా విడుద‌ల తీదీని వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడున్న క‌రోనా ప‌రిస్థితుల కార‌ణంగా ఎప్పుడు వ‌స్తుందో అన్న అనుమానంలో ఉన్నారు అభిమానులు. వారిలో అంచ‌నాలు త‌గ్గిపోయేలా ఉన్నాయి.

దీంతో వారిలో సినిమాపై క్రేజ్ త‌గ్గ‌కుండా చూసేందుకు కొర‌టాల ప్లాన్ వేస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే టీజ‌ర్‌, లాహే లాహే సాంగ్‌తో మంచి పేరు వ‌చ్చింది. ఇప్పుడు రెండో పాట‌ను విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడంట‌. ఇందులో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి స్టెప్పులేసిన ఓ పాట‌ల‌ను విడుద‌ల చేయాల‌ని చిరు, కొర‌టాల భావిస్తున్న‌ట్టు స‌మాచారం. త్వ‌రోల‌నే దీన్ని విడుద‌ల చేస్తారంట‌. అదే జ‌రిగితే ఫ్యాన్స్‌కు పండ‌గే.

Read more RELATED
Recommended to you

Latest news