పాన్ ఇండియా మూవీతో రీఎంట్రీ ఇవ్వనున్న లయ.. హీరో ఎవరంటే..?

-

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి లయ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. తెలుగమ్మాయిగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈమె చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు విమానాశ్రయంలో కూడా మmఈమె ఉద్యోగం చేసింది. ఒకానొక సమయంలో ట్రెడిషనల్ లుక్ లో మెరిసి హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె ఎక్కువగా సెకండ్ రేంజ్ హీరోలకు జోడిగా నటించి మెప్పించింది. జగపతిబాబు, శ్రీకాంత్, వడ్డే నవీన్, శివాజీ, జె.డి చక్రవర్తి వంటి హీరోలకు హీరోయిన్గా నటించి మెప్పించింది.

పెళ్లయిన తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన ఈమె ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక టీవీ షోలో పాల్గొన్న ఈమె త్వరలో వెండితెరపై సందడి చేయబోతుందట . అది కూడా ఒక పాన్ ఇండియా సినిమాతో తాను రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇక ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయాన్ని పవర్ స్టార్ రామ్ చరణ్ అని, ఆయన శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నట్లు సమాచారం.

ఇందులో కీలక పాత్ర కోసం లయని సంప్రదించగా దాదాపు ఆమె ఒప్పుకునే స్టేజ్ లో ఉంది అని.. ఇదే నిజమైతే ఆమె రీ యంట్రీ కన్ఫామ్ అయినట్టే అని చెబుతున్నారు మేకర్స్. మరి ఏం జరుగుతుందో చూడాలి.. ఇప్పటికే లయ తెలుగు సినిమాలలో నటించాలన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమాలో నటిస్తే పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇక ఈమెకు కూడా మరింత క్రేజ్ లభించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news