‘లియో’ రిలీజ్ నేపథ్యంలో.. కాలి నడకన తిరుమలకు డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌

-

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా- డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలకు తమిళనాడు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం రాత్రి తన టీమ్‌తో కలిసి కాలినడకన తిరుమల చేరుకున్న ఆయన గురువారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారికి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన లోకేశ్‌.. అభిమానులతో ముచ్చటించారు. పలువురితో ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మారాయి. తన సినిమా విజయం అందుకోవాలని కోరుకుంటూ శ్రీవారిని దర్శనం చేసుకున్నట్లు తెలిపారు.

‘లియో’లో హీరోయిన్​గా త్రిష నటిస్తుండగా.. అర్జున్‌ సర్జా, సంజయ్‌ దత్‌, అర్జున్‌ దాస్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, ప్రియా ఆనంద్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version