ఈ సినిమా కూడా ఓటీటీలోనే..!

-

క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అన్నిరంగాలూ విల‌విలాడుతున్నాయి. ఇక సినిమా రంగం ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా మారుతోంది. ఎక్క‌డి సినిమాలు అక్క‌డే ఆగిపోయాయి. ఇటీవ‌ల మ‌ళ్లీ కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. అయితే.. సినిమా థియేట‌ర్లు మాత్రం ఓపెన్‌కాలేదు. దీంతో ప‌లు సినిమాలు ఓటీటీలో విడుద‌ల అవుతున్నాయి. ఈ జాబితాలోనే మాధవన్, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించిన తమిళ చిత్రం ‘మారా’ కూడా చేరుతున్న‌ట్లు ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

నూతన దర్శకుడు దిలీప్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘చార్లీ’ చిత్రానికి ఇది రీమేక్ కావ‌డం గ‌మ‌నార్హం‌. దుల్కర్‌ సల్మాన్‌ చేసిన పాత్రను మాధవన్‌ చేశారు. హీరోయిన్‌ పార్వతి పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్‌ నటించారు. నిజానికి.. లాక్‌డౌన్‌ ముందే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కూడా నేరుగా ఓటీటీలో విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో ఈ చిత్రబృందం ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news