మహర్షి అక్కడ బేరం తెగట్లేదట

-

సూపర్ స్టార్ మహేష్ హీరోగా తన 25వ సినిమాగా వస్తున్న సినిమా మహర్షి. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. భరత్ అనే నేను సినిమా 99 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా అంత బడ్జెట్ పెట్టి నిర్మించడం హాట్ న్యూస్ గా మారింది.

ఎలా లేదన్నా మహర్షి 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని అంచనా. అయితే ఓవర్సీస్ లో 18 నుండి 20 కోట్ల దాకా కోట్ చేస్తుండగా అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కి తగ్గుతున్నారని తెలుస్తుంది మహేష్ సినిమా యూఎస్ లో మంచి ఓపెనింగ్స్ తెస్తుంది. అక్కడ వసూళ్లు కూడా బాగుంటాయి. అయితే ఇది హిట్ అయిన సినిమాకు ఆశించిన ఫలితాలు రాకుంటే తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కు సమానంగా యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అవ్వాల్సి వస్తుందట.

అదీగాక ఈమధ్య తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో అంతగా రాణించలేదు. అందుకే మహర్షి సినిమా విషయంలో కాస్త ముందు వెనుకా ఆలోచిస్తున్నారట. మరి అక్కడ బేరం ఎంతకు కుదుర్చుకుంటారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news